Wednesday, 04 March 2026 03:02:28 PM
 BREAKING NEWS
     -> వాట్సప్‌ బదులుగా స్వదేశీ యాప్‌ అయిన అరట్టైను ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది...      -> పాట్నా ఎన్నికల ప్రవర్తనా కోడ్ ఉల్లంఘన.. ప్రశాంత్ కిశోర్‌పై కేసు..      -> కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ సరికొత్త రికార్డ్.....      -> విశాఖకు పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయి... నగరం రూపురేఖలు మార్చాలి: మంత్రి నారా లోకేశ్..      -> అక్టోబరు 14న ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబుతున్నాం: సీఎం చంద్రబాబు..      -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం..      -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌..      -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్..      -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్..      -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి..      -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన ..      -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం..      -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె..      -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్..      -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి..      -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు..      -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

విశాఖకు పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయి... నగరం రూపురేఖలు మార్చాలి: మంత్రి నారా లోకేశ్

#visakhapatnam #vizaglocalnews #vizaglokeshopening #naralokesh


Date : 12 October 2025 11:26 PM Views : 242

వైజాగ్ లోకల్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : రానున్న రోజుల్లో విశాఖపట్నం రీజియన్ భారీ ఎత్తున పెట్టుబడులకు కేంద్రంగా మారనుందని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, రాబోయే 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఒక పటిష్టమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "విశాఖ ప్రాంతానికి పెద్ద ఎత్తున కంపెనీలు, పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరం యొక్క రూపురేఖలు మార్చేలా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి. బెంగళూరు, పుణె వంటి నగరాలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు భవిష్యత్తులో విశాఖలో తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. దీనికోసం విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి" అని సూచించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను చేపడుతోందని, రాబోయే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌తో పాటు ఇతర కంపెనీల ఏర్పాటు ద్వారా సుమారు 5 లక్షల ఉద్యోగాలు స్థానిక యువతకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మేధోపరమైన చర్చల ద్వారా నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన కోరారు. అభివృద్ధి పనులు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి ఆమోదంతో 'మిషన్ మోడ్'లో జరగాలని స్పష్టం చేశారు. నగరంలో కొత్త ఐటీ పార్కుల ఏర్పాటుకు అనువైన ల్యాండ్ బ్యాంకులను వెంటనే గుర్తించి, సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Vizag Local News

Admin

లైవ్ టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Vizag Local News 2026. All right Reserved.